డేటాపై రాష్ట్ర ప్రభుత్వానికీ నోటీసులిస్తాం
అమెజాన్ సంస్థకు కూడా పంపుతాం
ఐటీ గ్రిడ్స్పై విచారణ కొనసాగుతోంది
సీఈవో అశోక్ మా వద్దకు రావాలి
లేదంటే అరెస్టుచేసి తీసుకొస్తాం
సైబరాబాద్ కమిషనర్ హెచ్చరిక
ఉద్యోగుల కుటుంబీకులకు వేధింపులు
ఏపీ పోలీసులపై సజ్జనార్ ఆరోపణ
అమెజాన్ సంస్థకు కూడా పంపుతాం
ఐటీ గ్రిడ్స్పై విచారణ కొనసాగుతోంది
సీఈవో అశోక్ మా వద్దకు రావాలి
లేదంటే అరెస్టుచేసి తీసుకొస్తాం
సైబరాబాద్ కమిషనర్ హెచ్చరిక
ఉద్యోగుల కుటుంబీకులకు వేధింపులు
ఏపీ పోలీసులపై సజ్జనార్ ఆరోపణ
ఆంధ్ర పోలీసులపై కేసు
SOURCE : హైదరాబాద్ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) :
వైసీపీ నేతల ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను అదుపులోకి తీసుకొని.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వారిని న్యాయమూర్తుల ముందు హాజరు పరచిన సైబరాబాద్ పోలీసులు.. ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనా కేసు నమోదుచేశారు. ఆంధ్ర ప్రభుత్వ డేటాను ఐటీ గ్రిడ్స్ చోరీ చేసిందని ఫిర్యాదుచేసిన లోకేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఏపీ పోలీసులు బెదిరించారని.. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. దౌర్జన్యం చేశారని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అంతేకాదు.. ఆంధ్ర రాష్ట్రప్రభుత్వానికీ నోటీసులు జారీచేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
ఆంధ్ర పోలీసులపై కేసు |
నిందితులపై ఐపీసీ 120బీ, 379, 420, 188 ఐటీ యాక్టు 72, 66బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం’ అని చెప్పారు. కంపెనీలో పోలీసుల సోదాలు జరుగుతున్నా దాని సీఈవో అశోక్ ఇప్పటి వరకు పోలీసుల ముందుకు రాలేదని.. పైగా కంపెనీ ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి.. కేసును, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించారని.. నలుగురు వ్యక్తులు మా అధీనంలోనే ఉన్నారని, నోటీసులిచ్చాకే విచారిస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ‘కమిషనర్గా ఉన్న నన్ను గానీ, స్థానిక ఇన్స్పెక్టర్ను గానీ సంప్రదించకుండా లోకేశ్వర్రెడ్డి ఇంటికి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? మా అదుపులో ఉన్న భాస్కర్తో పాటు, మిగిలిన వారి ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డు చేయడమేంటి? పోలీసుల పనితీరును తప్పుబట్టి, విమర్శలు చేస్తున్న కంపెనీ సీఈవో ఎందుకు పరారీలో ఉన్నారు? వెంటనే హాజరై అతడి వద్దకు ఆంధ్ర ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వచ్చిం ది...? ఎవరిచ్చారు..? ఎందుకిచ్చారు.. అనే వివరాలను పోలీసుల ముందు వివరించాలి. వెంటనే లొంగిపోకపోతే ఎక్కడున్నా అరెస్టు చేసి తీసుకు రావలసి ఉంటుంది’ అని సజ్జనార్ హెచ్చరించారు.
Social Plugin