కరోనా పేషెంట్ 100వ పుట్టినరోజు వేడుక.. కాస్త ఆలోచించండి అంటోన్న ఉపాసన

కరోనా పేషెంట్ 100వ పుట్టినరోజు వేడుక.. కాస్త ఆలోచించండి అంటోన్న ఉపాసన
మెగా పవర్ స్టార్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆలోచింపజేసే, స్ఫూర్తిని నింపే పోస్టులు పెడుతూ ఉంటారు. అలాగే, ప్రజలకు ఉపయోగకరమైన విషయాలను చెబుతూ ఉంటారు. మంగళవారం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోస్ట్ ఒకటి చేశారు. అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతోన్న ఒక కరోనా రోగికి అక్కడి డాక్టర్లు పుట్టినరోజు వేడుకను జరిపారు. ఇది ఆమెకు 100వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఫొటో కూడా షేర్ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన బయటపెట్టడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ చాలా మందికి సోకుతోంది. అయితే, కరోనా సోకిన వారి పట్ల ఈ సమాజం వివక్ష చూపుతోంది. వారిని అంటరానివాళ్లుగా కొంత మంది చూస్తున్నారు. అలాంటి వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకే కరోనా రోగి 100వ పుట్టినరోజు వేడుకను ఉపాసన బయటపెట్టాల్సి వచ్చింది. పోరాడాల్సింది కరోనాతో కానీ రోగితో కాదని మరోసారి ఉపాసన తెలియజేశారు. ‘‘మనకు జీవిత పాఠాన్ని నేర్పే ఒక ఆనంద క్షణం ఈరోజు అపోలో హాస్పిటల్స్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రియమైన మహిళ మనతో తన 100 పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె కొవిడ్ పేషెంట్. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మనకు పాజిటివ్ మైండ్‌సెట్ ఉంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చన్నది నా భావన. బాధ, నొప్పి మధ్య కూడా కొన్ని ఆనంద క్షణాలను గడపవచ్చు. దీనికి ఆ కేక్, బెలూన్స్ నిదర్శనం. మీరేమంటారు? షేర్ చేయాల్సిన అవసరం లేదు, కాస్త దీని గురించి ఆలోచించండి’’ అని ఉపాసన పేర్కొన్నారు. రోగి వివరాల్లో గోప్యత పాటించాలి కాబట్టి ఆమె ముఖాన్ని బ్లర్ చేశానని ఉపాసన వెల్లడించారు. ఆ మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కాగా, ఉపాసన షేర్ చేసిన ఫొటోలో డాక్టర్లు పీపీఈ కిట్‌లు ధరించి ఆ వృద్ధ మహిళ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు.


https://ift.tt/30H6V7g taken from source: